AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పంట పొలాల్లో మిన్నంటిన సంబరాలు.. రుణమాఫీపై సర్వత్రా హర్షాతిరేకాలు

సీఎం రేవంత్‌కు వినూత్న రీతిలో కృతజ్ఞతలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల రుణ మాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. మొదటి విడత ప్రకటించిన జాబితాలో వారి రుణాలు మాఫీ అవుతుండడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. పంట పొలాల్లోనే కేక్‌ కట్‌ చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. సీఎం రేవంత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.

సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణ మాఫీ మొదటి లిస్టు ప్రకటించడంతో రైతుల సంతోషం అంతాఇంతా కాదు.. సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వినూత్న రీతిలో సంబరాలు జరుపుకుంటున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో రైతులు వ్యవసాయ క్షేత్రంలోని నారుమడుల్లో సీఎం రేవంత్‌ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకొన్నారు.. అనంతరం రైతులంతా కలిసి అదే పొలంలో నాగలి గొర్రు కర్రకు కాంగ్రెస్‌ జెండాను కట్టి ఎగరవేశారు. పంట పొలాల్లో చుట్టుపక్కల రైతులంతా కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఆనందంతో కేరింతలు కొడుతూ పశువులకు తిలకం దిద్ది ఒకరికొకరు అలయ్‌ బలయ్‌ చేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయన్నారు ఈ సందర్భంగా రైతులు అన్నారు. అటు మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట మండలం కొరవిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. రుణ మాఫీ హామీ ఇచ్చి తమకు ఆర్థికంగా అండగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు.

డిప్యూటీ సీఎం భట్టి బ్యాంకర్లతో సమావేశం..
మరోవైపు ప్రజాభవన్‌లో బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం అయ్యారు. రుణమాఫీ అమలుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చించారు. ఈ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి భట్టి, తుమ్మలతోపాటు అధికారులు హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కావడంతో ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చూసేలా కార్యాచరణపై ఫోకస్‌ పెట్టారు. ప్రభుత్వం ఇచ్చే రుణ మాఫీ డబ్బులు, మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10