బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ముంబైలోని ఆస్పత్రిలో చేరింది. తీవ్రస్థాయిలో ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని ద్రువీకరించారు. అయితే ప్రస్తుతం ఆమె కండీషన్ బాగానే ఉన్నట్లు ఆయన చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో జాన్వీ కోలుకోనున్నట్లు బోనీ కపూర్ వెల్లడించారు. ఆ తర్వాతే ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. గత వారం అంబానీ ఇంట పెళ్లికి జాన్వీ హాజరైన విషయం తెలిసిందే.ఆ వేడుకలో ఆమె ఫుల్ చిందేసింది.
ఉల్జా చిత్రంలో జాన్వీ నటిస్తోంది. ఆ ఫిల్మ్ ట్రైలర్ను ఈ వారమే రిలీజ్ చేశారు. విదేశాంగ శాఖలో డిప్యూటీ హై కమీషనర్గా చేసిన సుహానా భాటియా పాత్రను జాన్వీ పోషించనున్నది. మిస్టర్ అండ్ మిస్సెస్ మహి చిత్రంలో జాన్వీ నటించింది. జూనియర్ ఎన్టీఆర్తో దేవర చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.