(అమ్మన్యూస్, హైదరాబాద్):
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఇల్లు కూలి తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమమ్మ(78), అంజిలమ్మ (35)గా గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున ఇల్లు కూలి ఆ తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమమ్మ(78)కు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. వారందరికీ వివాహాలు జరిగాయి. కొడుకు, కోడలు మరో ఇంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే భారీ వర్షాలకు జిల్లాలో వాగులు వంకలు, పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.