నిత్యాన్న కేంద్రంలో పేదలకు స్వయంగా వడ్డన
కంది శ్రీనివాస రెడ్డి సేవలను కొనియాడిన ఆమేర్ ఆలీ ఖాన్
ఆదిలాబాద్ : ఎమ్మెల్సీ అమేర్ ఆలీఖాన్ ఆదిలాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన సాగుతున్న నిత్యాన్న దాన కేంద్రాన్ని సందర్శించి పేదలకు స్వయంగా వడ్డించారు.
కంది శ్రీనివాస రెడ్డి సేవలను ఆయన కొనియాడారు. ప్రజా సేవాభవన్ హైదరాబాద్ గాంధీ భవన్ తలపిస్తుందని ప్రశంసించారు.ఇక్కడ కంది శ్రీనివాస రెడ్డి క్యాడర్ ను మేయింటెయిన్ చేస్తున్న తీరు అభినందనీయమన్నారు. అందర్నికలుపుకుపోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. తను ఇక్కడ లేకున్నా ఆయన పిలుపుతో ఇంత మంది రావడం తనకు ఘన స్వాగతం పలకడం చూస్తే శ్రేణులకు ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని తెలియ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ నాయకులు , పార్టీ శ్రేణులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.