AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా..

గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని మొదట నిర్ణయించగా నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో పరీక్షల తేదీలను మార్చింది. డీఎస్సీ పరీక్షలు జులై 18నుంచి ఆగస్టు 5వరకు ఉండటం వెంటనే గ్రూప్-2పరీక్షలు ఉండడంతో అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పలు ధర్నాల అనంతరం పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10