AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏ-14… నారా లోకేష్‌ పై సీఐడీ కేసు!

ప్రస్తుతం ఏపీలో స్కాం లు, సీఐడీ పిటిషన్లు, రిమాండ్ లు.. వాటి ఫలితంగా విపరీతంగా వేడెక్కిన రాజకీయాలతో పరిస్థితి రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నారా లోకేష్ పేరు కూడా తాజాగా ఎంటరైంది. అవును… ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా.. మరోపక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌ మెంటు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ను 14వ నిందితుడిగా చేరుస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసుపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంలో లోకేష్ పేరు బలంగా వినిపించే అవకాశం ఉందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యలో సీఐడీ కోర్టులో అధికారులు తాజాగా మెమో ఫైల్ చేస్తున్నారు. ఈ కేసులో సీఐడీ అధికారులు ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చారు. దీంతో హైకోర్టులో అమరావతి రింగ్‌ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌ కేసు ఈ రోజు వాదనలు వినే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క సుప్రీంలో బాబు తరుపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ పై రేపు విచారణలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించిన ప్రభుత్వం ఆ తర్వాత దీని అలైన్మెంట్లో పలు మార్పులు చేసింది. ఫలితంగా… ఉండవల్లి కరకట్టపై ఇల్లు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణకు భూములు క్విడ్ ప్రోకోగా దక్కాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో చంద్రబాబును ఇప్పటికే సీఐడీ ఏ1గా చేర్చగా.. నారాయణను ఏ2గా చేర్చింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10