AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వహీదా రెహమాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..

ప్ర‌ముఖ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి వ‌హీదా రెహ‌మాన్ కి దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కి ఎంపిక‌య్యారు. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఐదు దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన్ని ద‌శాబ్దాల పాటు వ‌హీదా విశేష సేలందించారు. ఆమెకు అవార్డు రావ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ..రాజ‌కీయ ప్ర‌ముఖులు విషెస్ తెలియ‌జేసారు. ఫాల్కే అవార్డు తో ఆమె ఖాతాలో మ‌రో అరుదైన వార్డు చేరింది. ఇప్ప‌టీకే వహీదా రెహ్మాన్‌కు 1972లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో, 2011లో ప‌ద్మ భూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

తాజాగా ఫాల్కే అవార్డు కూడా సొంతం చేసుకోవ‌డంతో వ‌హిదా పేరు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. 1955లో ‘రోజులు మారాయి’ తెలుగు చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు వహీదా రెహమాన్‌. ఈ చిత్రంలోని ‘ఏరువాక సాగారో రన్నో..’ పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. తదుపరి జయసింహ, బంగారు కలలు, సింహాసనం, చుక్కల్లో చంద్రుడు చిత్రాల్లో నటించారు. 2018లో కమల్‌హాసన్‌ తెరకెక్కించిన ‘విశ్వరూపం-2’ చిత్రంలో కశ్మీరీ మదర్‌గా నటించారు. అయితే తెలుగులో చేసింది కొన్ని సినిమాలే. ఆమె కెరీర్‌లో ఎక్కువ హిందీ చిత్రాల్లోనే నటించారు. న‌టిగా ఆమెకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. త‌న‌దైన శైలి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. వహీదా ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. 1974లో శశిరేఖిని ని వివాహం చేసుకున్నారామె. 2000 సంవత్సరంలో భర్త మరణించ డంతో ఆమె తన పిల్లలతో కలిసి ముంబైలోనే ఉంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10