AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిరుద్యోగులకు మరోసారి నిరాశ.. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది టీఎస్ పీఎస్ సీ. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడగా ముచ్చటగా మూడోసారి పోస్ట్ పోన్ అయ్యింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది టీఎస్ పీఎస్ సీ. కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామంది.

పేపర్ లీక్ కారణంగా గతంలో ఒకసారి గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా రెండోసారి వాయిదా పడింది. కొత్త ఏడాదిలో జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, తాజాగా మరోసారి పరీక్ష వాయిదా పడింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ తో పాటు గ్రూపు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో మరోసారి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాల్సి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించేందుకు పరిస్థితులు లేవంటూ మరోసారి గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేశారు. ఈ మేరకు టీఎస్ పీఎస్ సీ ప్రకటన చేసింది. గ్రూప్ 2 పోస్టులకు 5లక్షల 50వేల మంది అప్లయ్ చేసుకున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6, 7వ తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, టీఎస్‌పీఎస్ సీ ఛైర్మన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. ఈ క్రమంలో గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీలను తొందరలోనే చెబుతామంది.

రాష్ట్రంలో గ్రూప్‌ -2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్‌-1 తర్వాత అత్యంత కీలకమైనది గ్రూప్‌ -2 ఉద్యోగమే కావడంతో 5,51,943 మంది దరఖాస్తు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10