AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రాణ స్నేహితులు ఒకే చోట..

సూపర్ స్టార్ రజినీకాంత్, మంచు మోహన్ బాబు ల మధ్య ఉన్న స్నేహం గురించి టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. వారిద్దరూ ప్రాణ స్నేహితులని. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ఇప్పటికే ఇద్దరూ పలుమార్లు చెప్పుకొచ్చారు కూడా. రజినీకాంత్ హైదరాబాద్ వస్తే.. మోహన్ బాబు ఇంటికి వెళ్లకుండా ఉండరు. అలాగే మోహన్ బాబు కూడా చెన్నై వెళ్తే రజినీ ఇంటికి వెళ్లాల్సిందే. అలాంటి స్నేహం వారిద్దరి మధ్యా ఉంది.

ఇప్పుడా ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. సూపర్ స్టార్ రజినీకాంత్, మంచు మోహన్ బాబు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో (Airport) దర్శనమిచ్చారు. ఇద్దరు కలిసి వచ్చి, కారెక్కి వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం రజినీకాంత్ ‘కూలీ’ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ రిసెప్షన్ నిమిత్తం చెన్నై వెళ్లిన మోహన్ బాబు.. ఆ ఫంక్షన్ చూసుకుని రిటన్ వచ్చే క్రమంలో ఇద్దరూ ఇలా కలిసి ఉండవచ్చు. ప్రస్తుతం వారిద్దరూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కబుర్లు చెప్పుకుంటూ వస్తూ కారెక్కి వెళుతున్న వీడియో చూసిన వారంతా.. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ వారి స్నేహం గురించి మరోసారి మాట్లాడుకుంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10