పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. రివర్స్ గేర్ వేసుకుని.. రూ. 270 తగ్గింది. శుక్రవారం నాడు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్స్ గోల్డ్పై రూ. 250 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ. 73,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67,600 ఉంది. అదే సమయంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారం, శుక్రవారం ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వెండి కిలో ధర రూ. 89,200 పలుకుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఈ ధరలు ఎంత ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,750 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 67,600 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 73,750, 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 67,600 ఉంది. విశాఖపట్నంలోనూ బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఒకే విధంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 92,500 గా ఉంది. విజయవాడలో – 92,500, విశాఖపట్నంలో – 92500 పలుకుతోంది.