AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవితతో హరీశ్‌రావు ములాఖత్‌ .. ధైర్యంగా ఉండాలని సూచన

విజయం మనదేనని భరోసా

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
తీహార్‌ జైలులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీశ్‌ రావు శుక్రవారం ఉదయం ములాఖాత్‌ అయ్యారు. ములాఖాత్‌ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు సూచించారు. ఇటీవలే మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌ కవితతో ములాఖత్‌ అయిన విషయం విదితమే.

ఢిల్లీ మద్యం విధానం కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. జూలై 5 వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

అధికారులు జూన్‌ 21వ తేదీన ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసును జూలై 3వ తేదీన రౌస్‌ ఎవెన్యూ కోర్టు మరోమారు విచారణ జరుపనున్నది. కాగా, కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10