AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎగువన భారీ వర్షాలు.. శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు

మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలకు కర్ణాటకలోని అల్మట్టి, నారాయణ్‌పూర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు కృష్ణా బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత జిల్లాలు ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కృష్ణా, దాని ఉప నదుల్లోకి భారీ వరద వస్తుందన్న అంచనాలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

అల్మటి జెక్టులోకి మంగళవారం సాయంత్రానికి 1.04 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిచేరింది. దీంతో డ్యామ్ నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటిమట్టం 129 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 103 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి జలాశయానికి వచ్చిన నీటి వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ జలాశయానికి 66 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. జూరాల వైపు 46 వేల క్యూసెక్కుల ప్రవాహం విడుదల చేస్తున్నారు.

జూరాలకు ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ఆ నీటి దిగువకు విడిచిపెడుతున్నారు. జూరాల నుంచి వరద శ్రీశైలం దిశగా సాగుతోంది. రెండు రోజుల్లో కృష్ణా నదిలో మరింత ప్రవాహం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జూరాల నిల్వ సామర్ధ్యం 9.6 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 7 టీఎంసీలు ఉంది. ఎగువ నుంచి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్తగా గేట్లను ఎత్తి.. కిందికి విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 7 వేల క్యూసెక్కుల వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 20 వేల క్యూసెక్కులను వదిలిపెడుతున్నారు. దీంతో నాగార్జున సాగర్‌కు ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం 23 వేల క్యూసెక్కులు వరద వస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, కర్ణాటకలని చిక్కమగళూరులో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా ఉపనది భద్ర ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. జిల్లాలోని పలు పట్టణాలకు, గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. తుంగభద్ర ప్రాజెక్టుకు 82వేలకుపైగా క్యూసెక్కుల వరద పోటెత్తింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10