AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారీ వర్షాలు: సీఎస్ శాంతి కుమారి సమీక్ష, కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి సూచించారు. అశ్వారావుపేట పెద్ద వాగు వరద పరిస్థితిపై సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి సీఎస్ సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం లోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడం వల్ల గేట్లు ఎత్తడంతో దిగువ భాగంలోని గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్న సంఘటనకై సీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ డీజీ, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ కూడా పాల్గొన్న ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సీఎస్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని చెప్పారు.

పెద్ద వాగుకు చెందిన 3 గేట్లు ఎత్తడంతో సమీపంలోని 4 గ్రామాలలోకి వరద నీరు ఒక్కసారిగా చేరడంతో వ్యవసాయ భూముల్లో నీటిలో చిక్కుకున్న 28మందిని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెండు హెలికాప్టర్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

మరో 20 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర రెస్క్యూ బృందాలు సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాయని అన్నారు. గుమ్మడివెళ్లి, కోయగూడెం, కొత్తూరు, గాజులపల్లి గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తరలించే ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ జితేష్ పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10