AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జాన్వీ క‌పూర్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌.. ఏమైందంటే..

బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ ముంబైలోని ఆస్ప‌త్రిలో చేరింది. తీవ్ర‌స్థాయిలో ఆమెకు ఫుడ్ పాయిజ‌నింగ్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు. అయితే ప్ర‌స్తుతం ఆమె కండీష‌న్ బాగానే ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌రో రెండు మూడు రోజుల్లో జాన్వీ కోలుకోనున్న‌ట్లు బోనీ కపూర్ వెల్ల‌డించారు. ఆ త‌ర్వాతే ఆమెను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేయ‌నున్నారు. గ‌త వారం అంబానీ ఇంట పెళ్లికి జాన్వీ హాజ‌రైన విష‌యం తెలిసిందే.ఆ వేడుకలో ఆమె ఫుల్ చిందేసింది.

ఉల్జా చిత్రంలో జాన్వీ న‌టిస్తోంది. ఆ ఫిల్మ్ ట్రైల‌ర్‌ను ఈ వార‌మే రిలీజ్ చేశారు. విదేశాంగ శాఖ‌లో డిప్యూటీ హై క‌మీష‌న‌ర్‌గా చేసిన సుహానా భాటియా పాత్ర‌ను జాన్వీ పోషించ‌నున్న‌ది. మిస్ట‌ర్ అండ్ మిస్సెస్ మ‌హి చిత్రంలో జాన్వీ న‌టించింది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో దేవ‌ర చిత్రంలోనూ ఆమె న‌టిస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10