AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

బీజేపీ శ్రేణుల్లో ఆందోళన
త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌ కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్లు. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక వార్డులో ఉంచి ఎయిమ్స్‌ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. కాగా.. అద్వానీ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఆయనకు ఏం జరిగిందనే విషయంపై అద్వానీ సన్నిహితులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

అత్యధిక కాలం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా..
కాగా, బీజేపీ పార్టీ అద్వానీ అత్యంత సీనియర్‌ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. 1927 నవంబర్‌ 8న కరాచీ (ప్రస్తుత పాకిస్థాన్‌)లో జన్మించిన అద్వానీ.. 1942లో స్వయం సేవక్‌ సంఘ్‌లోలో చేరారు. బీజేపీకి అత్యధిక కాలం జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. 1986–1990 వరకు, 1993–1998 వరకు, 2004 –2005 వరకు అద్వానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయూ ప్రధానిగా ఉన్న సమయంలో 1999–2004 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. 2002–2004 మధ్య ఉప ప్రధానమంత్రిగానూ సేలవందించారు.

ఇటీవలే భారత రత్న పురస్కారం..
2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆయన్ను ప్రధాని మంత్రి అభ్యర్థిగా ప్రకటించగా.. ఆ ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించింది. ఆ తర్వాత వయసురీత్యా ఆయన క్రీయాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఇక మూడు నెలల క్రితం భారత ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి భారతరత్నను అందజేసిన విషయం తెలిసిందే.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10