AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి పొంగులేటికి గాయాలు.. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఘటన

టూ వీలర్‌ స్కిడ్‌
(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఖమ్మం మండలంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎడమ కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఆయన మండల పరిధిలోని జలగం నగర్, కేబీఆర్‌ నగర్, టెంపుల్‌ సిటీ, నాయుడుపేట వరద ముంపు బాధితులను పరామర్శించారు. అనంతరం పొంగులేటి ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయీస్‌ కాలనీలోని వరద బాధితులను పరామర్శించడానికి టు వీలర్‌పై వెళ్లారు. ఈ క్రమంలోనే కాలనీలో బండి ఒక్కసారిగా స్కిడ్‌ అయి జారి పడ్డారు. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్‌ ఆఫీస్‌కు తరలించారు. జిల్లా ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర గౌడ్‌ ఆయనకు ఫస్ట్‌ ఎయిడ్‌ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10