AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇల్లు కూలి తల్లి, కూతురు మృతి.. నారాయణపేట జిల్లాలో విషాదం..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఇల్లు కూలి తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమమ్మ(78), అంజిలమ్మ (35)గా గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున ఇల్లు కూలి ఆ తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమమ్మ(78)కు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. వారందరికీ వివాహాలు జరిగాయి. కొడుకు, కోడలు మరో ఇంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే భారీ వర్షాలకు జిల్లాలో వాగులు వంకలు, పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10