– కస్టమర్ల మనసు దోచుకుంటున్న ప్రణీత్ అంబియన్స్
-అధునాతన సదుపాయాలతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్..
-ప్రణీత్ కాన్సెప్ట్స్ అధినేత పీఎన్ సురేష్
హైదరాబాద్ అన్నిరంగాల్లో దూసుకెళ్తోంది. అందులోనూ రియల్ ఎస్టేట్ రంగంలో తగ్గేదేలే అంటుంది మన భాగ్యనగరం. గత ఐదేళ్లలో భారత రియాల్టీలోకి భారీగా పెట్టుబడులు వచ్చిన మొదటి ఐదు నగరాల్లో హైదరాబాద్ స్థానం సంపాదించుకుంది. ఢిల్లీ, ముంబాయి లాంటి నగరాలను వెనక్కి నెట్టేసి భూలావాదేవీల్లో హైదరాబాద్ నెంబర్వన్గా నిలిచిందని ప్రణీత్ కాన్సెప్ట్స్ అధినేత పీఎన్ సురేష్ అన్నారు. మంగళవారం మణికొండలోని ప్రణీత అంబియన్స్లో ఏర్పాటు చేసిన కస్టమర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రాజెక్టు ఏ, బీ, సీ బ్లాక్ లను డిసెంబర్ నాటికి పూర్తి చేసి తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తమ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ప్రణీత అంబియన్స్ అధునాతన సదుపాయాలతో నగరంలోని వ్యూహాత్మక ప్రదేశంలో అగ్రశ్రేణి విద్యాసంస్థలు, అన్నిరకాల వైద్య సదుపాయాలు, వినోద కేంద్రాల మధ్యలో ప్రపంచ స్థాయి క్లబ్హౌస్ తో పాటు ప్రాజెక్ట్ ఫేజ్-1, ఫేజ్-2 కోసం ప్రత్యేక క్లబ్హౌస్లు, రూఫ్-టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, జిమ్, బిజినెస్ లాంజ్, యోగా, పిల్లలు, పెద్దలకు అద్భుతమైన క్రీడా సౌకర్యాలను కలిగి ఉన్న ఈ ప్రాజెక్టు అన్ని వయసుల వారినీ ఆకర్షిస్తుందన్నారు.
అంతేకాకుండా తమకు అత్యంత విలువైన సలహాలు, సూచనలు అందజేస్తున్న ఆనంద్ హోం, వీఐపీఎల్, హాల్ మార్క్ సంస్థల అధినేతలకు కృతజ్క్షతలు తెలిపారు. తమ కొనుగోలుదారులకు సకాలంలో ఉన్నతమైన నివాస స్థలాలను అందించడంలో తమ అంకితభావానికి ఈ ప్రాజెక్టు నిదర్శనమన్నారు. అనంతరం కస్టమర్లు తమ విలువైన సలహాలను సూచనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధినేత పీఎన్ సురేష్, మణికొండ ముఖ్య నాయకులు ప్రణీత్ , రాహుల్, పూర్ణచంద్రారెడ్డి, కాన్సెప్ట్ మేనేజర్ ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.