AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లోదరఖాస్తులు స్వీకరించనున్నారు.

గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. పేపర్‌ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్‌ను రద్దయ్యాయి. ఇటీవల మరో 60 గ్రూప్‌-1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణ – ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు
అప్లికేషన్లు ఎడిట్‌ చేసుకునే అవకాశం- మార్చి 23 నుంచి 27 వ తేదీ వరకు
ప్రిలిమినరీ పరీక్ష – మే/జూన్‌ 2024
మెయిన్స్‌- సెప్టెంబర్‌/అక్టోబర్ 2024

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10