AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యే పదవి కోసం అడుక్కోవాలా?.. కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి హాట్‌ కామెంట్స్‌

చేసిన సేవలు మరిచిపోయారు..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. నేను చేసిన సేవలు ప్రజలు మర్చిపోయారని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవి కోసం నేను అడుక్కోవాలా? అలా అడుక్కునే పదవి నాకు వద్దు అని అన్నారు. నేను పదవి లేకున్నా బతుకుతానని గొంతెత్తి చెప్పుకొచ్చారు. నేను ఓట్ల కోసం సేవ చేయనని వెల్లడించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా నాకు ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. కానీ సొంత కాంగ్రెస్‌ పార్టీ నాయకులే.. నేను ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదని ప్రచారం చేశారన్నారు. దీంతో బాధేసిందని జగ్గారెడ్డి ఎమోషనల్‌ అయ్యారు.

ఇక ఇటీవల జగ్గారెడ్డి పీసీసీ పదవి ఎవరికి కట్టబెట్టినా తనకు అభ్యంతరం లేదని వెల్లడించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీలో తనకు అటెండర్‌ జాబ్‌ ఇచ్చినా.. చేస్తానంటూ జగ్గారెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. రాబోయే పదేళ్లలో ఆయన ఏదో ఒకరోజు తప్పకుండా పీసీసీ పదవి చేపడాతనని, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కూడా అవుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ చెప్పిన మాటలను ఫాలో అవుతానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10