రైతు భరోసా పై నిర్ణయం తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. గత నెల 22న జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే రైతు భరోసా పథకంపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తదనుగుణంగా భట్టి సారధ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది.
రైతు భరోసా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మల్లు భట్టి విక్రమార్క, కమిటీలో సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. రైతు భరోసా పథకం అమలు చేయడానికి విధి విధానాలపై చర్చించి రాష్ట్ర మంత్రి మండలికి భట్టి విక్రమార్క సారధ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు చేస్తుంది.