AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సెమీస్‌కు టీమిండియా.. ఆసీస్‌పై ఘనవిజయం..

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్‌-8 పోరులో భాగంగా సోమవారం (జూన్ 24)న జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాను భారత్‌ 24 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

కెప్టెన్ రోహిత్‌ శర్మ (92) దంచికొట్టాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎప్పటిలాగానే ఓపెనర్ ట్రావిస్ హెడ్ (74) చెలరేగాడు. అయితే భారత బౌలర్లు విజృంభించడంతో ఆఖరిలో వరుసగా వికెట్లో కోల్పోయింది ఆసీస్. దీంతో విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3, కుల్దీప్‌ 2, అక్షర్‌, బుమ్రా ఒక వికెట్‌ తీశారు. ఈ విజయంలో టీమిండియా సెమీస్ బెర్తు ఖరారైంది. మరోవైపు ఈ ఓటమితో ఆసీస్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆసీస్ సెమీస్ అవకాశాలు ఆధార పడి ఉన్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10