AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చైనాలో పడిన రాకెట్.. పరుగులు తీసిన జనం

బీజింగ్: ఫ్రాన్స్‌తో కలిసి చైనా లాంగ్ మార్చ్ 2 సీ రాకెట్‌ను (Long March 2C) శనివారం ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన కాసేపటికి రాకెట్‌లోని కొంత భాగం పేలింది. నివాస ప్రాంతానికి సమీపంలో పడటం ఆందోళన కలిగించింది. రాకెట్‌లోని కొంత భాగం భూమి మీద పడే సమయంలో జనం భయంతో పరుగు తీశారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. లాంగ్ మార్చ్ 2సీలో నెట్రోజన్ టైట్రాక్సైడ్, అన్ సిమెట్రిక్ డైమెథైల్హైడ్రాజెన్ హైపర్ గోలిక్ మిశ్రమం ఉపయోగించారు. ఇవి విష పదార్థాలు. రాకెట్‌లో కొంత భాగం పేలడంతో భయం ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకు పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విష పదార్థాలు గాలిలో కలిసిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి దెబ్బతీస్తుందని ఆందోళన చెందారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10