AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు.. ఏం చర్చించారంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌కళ్యాణ్‌తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. అల్లు అరవింద్, అశ్వనీదత్, ఏఎం రత్నం, దిల్‌రాజు, దగ్గుపాటి సురేష్ సహా పలువురు సినీ ప్రముఖులు డిప్యూటీ సీఎం పవన్‌ని కలిశారు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో సినీరంగ అభివృద్ధి, విస్తరణపై చర్చించారు. డిప్యూటీ సీఎంని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత అల్లు అరవింద్. టికెట్ల అంశం చాలా చిన్న విషయం. అంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటిపై త్వరలోనే ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తామన్నారు. సినీ ఇండస్ట్రీ తరపున అభినందించేందుకు సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరామన్నారు అల్లు అరవింద్. చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇస్తే.. సినీ ఇండస్ట్రీలోని అన్ని అసోషియేషన్ల నుంచి ప్రతినిధులు వచ్చి సీఎంకి సన్మానం చేయనున్నారు. ఇండస్ట్రీలోని సమస్యలపై సీఎంకు వినతిపత్రం ఇచ్చే ఆలోచనలో ఉంది టాలీవుడ్.

మరోవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు అల్లు అరవింద్ తెలిపారు. తమ విజ్ఞప్తికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గా సానుకూలంగా స్పందించినట్టు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని తెలిపారు. . ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్ , నిర్మాతలు సి.అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, డి.సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10