టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్ను ప్రారంభించాడు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ ఆటగాడు హైదరాబాద్లో తన కొత్త బ్రాంచ్ను స్టార్ట్ చేశాడు. విరాట్కు ఇంతకుముందే న్యూవా, వన్8 కమ్యూనీ పేరిట రెస్టారెంట్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వన్8 కమ్యూనీకి సంబంధించి కొత్త బ్రాంచ్ను హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ప్రారంభించాడు. ఇక ఈ ఓపెనింగ్ వేడుకకు ఆర్సీబీ ఆటగాళ్లు వచ్చి సందడి చేశారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇందులో భారతీయ వంటకాలతో పాటు విదేశీ వంటకాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తుంది.
![](https://ammadaily.com/wp-content/uploads/2024/07/ys-revanth.jpg)