AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైద‌రాబాద్‌లో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించిన విరాట్ కోహ్లీ..

టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ ఆటగాడు హైద‌రాబాద్‌లో త‌న కొత్త బ్రాంచ్‌ను స్టార్ట్ చేశాడు. విరాట్‌కు ఇంత‌కుముందే న్యూవా, వన్8 కమ్యూనీ పేరిట రెస్టారెంట్లు ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా వన్8 కమ్యూనీకి సంబంధించి కొత్త బ్రాంచ్‌ను హైద‌రాబాద్‌లోని హైటెక్ సిటీలో ప్రారంభించాడు. ఇక ఈ ఓపెనింగ్ వేడుకకు ఆర్‌సీబీ ఆట‌గాళ్లు వ‌చ్చి సందడి చేశారు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఇందులో భార‌తీయ వంట‌కాల‌తో పాటు విదేశీ వంటకాలను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10