AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జాక్ పాట్ కొట్టిన విరుష్క జంట.. రూ. 2 కోట్లు పెడితే రూ.10 కోట్లు

ఆన్‌లైన్ వేదికగా బీమా ఉత్పత్తులు అమ్మే గో డిజిట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయ్యింది. ఇష్యూ ధర రూ.271 కాగా.. ఇంట్రాట్రేడ్‌లో 3.35 శాతం లాభపడి రూ.281 వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే గతంలో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన చాలా మంది లాభపడ్డారు. వీరిలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కూడా ఉన్నారు.

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2020లో రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒక్కో షేర్‌ను రూ.75లకు కోహ్లీ కొనుగోలు చేశాడు. కోహ్లీతో పాటుగా ఈ బీమా సంస్థలో ఆయన భార్య అనుష్క శర్మ కూడా రూ. 50లక్షలు పెట్టుబటి పెట్టి షేర్లు కొంది. దీంతో వీరిద్దరు కలిసి రూ.2.5కోట్ల పెట్టుబడులను ఈ గో డిజిట్ కంపెనీలో పెట్టారు.

నేడు అదే షేర్ రూ.300 దాటింది. కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన మొత్తం నేడు రూ.8 కోట్లకు చేరింది. అనుష్క పెట్టుబడి 2 కోట్ల రూపాయలు అయింది. వీరిద్దరూ కలిపి పెట్టుబడి పెట్టిన మొత్తం ప్రస్తుతం రూ.10 కోట్లు అయింది. ఇది 4 రెట్లు రిటర్న్. గో డిజిట్ షేర్లు ఈరోజు అంటే మే 23న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. ప్రస్తుతం కోహ్లీ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడార్‌గా కూడా ఉన్నాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10