AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ.. కీలక ప్రకటన

బీజేపీకి దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘వైసీపీ మీతోనే ఉంది.. మీకు మద్దతు ఇస్తోంది’ అని అధికారిక ప్రకటన కూడా చేసేయడం గమనార్హం. ఎన్డీఏకు వైసీపీ మద్దతు ఇస్తోంది. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిగా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో మరిన్ని పార్టీల మద్దతు కోసం అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా సైతం ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

ఇదే అదునుగా చేసుకుని ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటన చేసేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి సమాచారం కూడా అందజేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన నలుగురు లోక్‌సభ ఎంపీలు పాల్గొంటున్నారు. ఇప్పటికే.. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి లోక్‌సభ సమావేశాల్లో భాగంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కడప ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి ఇంతవరకూ ప్రమాణం చేయలేదు. దీంతో స్పీకర్ ఎన్నికకు హాజరు కావాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో రెండ్రోజులపాటు సమావేశాలకు డుమ్మా కొట్టిన అవినాష్.. బుధవారం సభకు హాజరుకాబోతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10