AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెట్టుబడులకు చైనా తర్వాత తెలంగాణనే బెస్ట్ .. సీఎం రేవంత్ రెడ్డి

ఎంఎస్ఎంఈ నూతన పాలసీ ఆవిష్కరణ

అమ్మన్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించింది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు పాలసీలను కొనసాగించినప్పుడు అభివృద్ధి సాధిస్తాయని చెప్పుకొచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు చైనా తర్వాత తెలంగాణనే బెస్ట్ డెస్టినేషన్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా.. ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పాలసీలు కొనసాగించినప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు చేసిన కృషిని ఎవరూ మరువలేరని కొనియాడారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే.. నూతన ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు. పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. స్కిల్ యూనివర్సిటీలో పరిశ్రమలకు ఉపయోగపడే వివిధ కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు. తద్వారా గ్రామాల్లో ఉండే యువతకు ఉపాధి దొరుకుతుందని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారని.. వాళ్లందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు ఉపయోగపడేలా తీర్చిదిద్ది.. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు.

కరోనా సృష్టించిన విధ్వంసం తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయని సీఎం అభిప్రాయపడ్డారు. చైనాతో పాటు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో.. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి లాంటిదని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. పెట్టుబడులు పెట్టేందుకు చైనా తర్వాత తెలంగాణా రాష్ట్రమే బెస్ట్ డెస్టినేషన్ అని రేవంత్ రెడ్డి వివరించారు. మరోవైపు తెలంగాణలో వ్యవసాయ పురోగతి సాధించేలా చర్యలు చేపట్టినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అనేదే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రైతులకు రూ. 2 లక్షల మేర రుణాలు మాఫీ చేశామని తెలిపారు. కుటుంబంలో కొందరు వ్యవసాయం మీద ఆధారపడితే.. మిగితావాళ్లు విభిన్న రంగాల్లో ఎదగాలని యువతకు రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమల అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10