AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపటి నుంచి సివిల్స్‌ మెయిన్‌ పరీక్షలు

కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ మెయిన్‌ పరీక్షలు ఈ నెల 20 నుంచి 29 వరకు జరుగనున్నాయి. ఉ. 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ. 2 : 30 గంటల నుంచి సా. 5 : 30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా 24 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో ఈ పరీక్షల కోసం 6 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయగా, 708 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షకు 30 నిమిషాల ముందే అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10