AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జానీ మాస్టర్‌ అరెస్ట్‌.. గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతన్ని గోవాలో సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మొదట జానీ మాస్టర్‌ ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయారని, మరోవైపు హైదరాబాద్‌ లోని తన స్నేహితుల ఇంట్లో తలదాచుకున్నాడు అంటూ ప్రచారాలు జరగగా.. తాజాగా అతన్ని గోవాలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తం నాలుగు బృందాలు జానీ మాస్టర్‌ కోసం గాలింపు చేపట్టాయి. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలతో జానీ మాస్టర్‌ ఆరు నెలలు జైలులో ఉన్నాడు.

మహిళా కమిషన్‌లోనూ..
మహిళా కమిషన్‌లోనూ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాపై ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు బాధితురాలితో కలిసి పలు మహిళా సంఘాల నాయకులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40పేజీలతో కూడిన లేఖను బాధితురాలు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద కు ఇచ్చారు. బాధితురాలికి అండగా ఉంటామని.. ఈ విషయాన్నీ సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆమె బాధితురాలికి హామీ ఇచ్చారు.

పలు సెక్షన్ల కింద..
జానీ మాస్టర్‌ లైంగిక ఆరోపణల కేసు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. అతని దగ్గర పని చేసే అసిస్టెంట్‌ మహిళా కొరియోగ్రాఫర్‌ లైంగిక ఆరోపణల కేసు పెట్టడం ప్రకంపనలు çసృష్టి్టస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోలీసులు ఐపీసీ 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు
అయితే జానీ మాస్టర్‌ కేసులో మరో సంచలన ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అతని పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్‌ గా ఉన్నప్పటి నుంచే జానీ వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో కేసు పెట్టారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10